టీమిండియా ప్రధాన స్పాన్సర్గా డ్రీమ్11
- మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ
- వెస్టిండీస్ తో టూర్ నుంచి అమల్లోకి రానున్న ఒప్పందం
- ఇప్పటిదాకా స్పాన్సర్ గా ఉన్న బైజూస్
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఇండియా తన తొలి టెస్టు సిరీస్ను ఆడనుంది. బైజూస్ స్థానంలో డ్రీమ్11 స్పాన్సర్ చేయనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ డ్రీమ్11కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇటీవల టీమిండియా కిట్ స్పాన్సర్గా అడిడాస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 2028 వరకు ఈ ఒప్పందం ఉంటుంది.