Ramcharan: ముఖేశ్ అంబానీ బంగారు ఊయల పంపించారనే విషయంపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ టీమ్! 

  • చరణ్, ఉపాసనల కుమార్తె బారసాల నేడు
  • అంబానీ బంగారు ఊయల పంపించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
  • ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసిన చరణ్ టీమ్
Mukesh Ambani gold cradle gift to Ram Charan is a false news

రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె బారసాల కార్యక్రమం ఈరోజు జరగనుంది. చిరంజీవి నివాసంలో వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఓ వార్త ఉదయం నుంచి మీడియాలో హల్ చేస్తోంది. చరణ్ కూతురుకి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ బంగారు ఊయలను కానుకగా పంపించారనేదే ఆ వార్త. 

ఈ ప్రచారంపై రామ్ చరణ్ టీమ్ స్పందించింది. ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు బహూకరించిన చెక్క ఊయలనే ఈ కార్యక్రమంలో వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ ఊయలను మెషీన్ తో కాకుండా చేతితోనే తయారు చేశారు. 

More Telugu News