Bride: పెళ్లి అయిన మరుసటి రోజే హైదరాబాద్ వధువుకు ప్రసవం.. షాక్ కు గురైన పెళ్లికొడుకు!

  • పెళ్లి అయిన రాత్రి వధువుకు కడుపునొప్పి
  • ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతి అని చెప్పిన డాక్టర్లు
  • కోడలిగా స్వీకరించేందుకు ఒప్పుకోని వరుడి తల్లిదండ్రులు
Bride delivered next day of marriage

పెళ్లి అయిన మరుసటి రోజే వధువు ప్రసవించడంతో అందరూ షాక్ కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కు చెందని మహిళకు గ్రేటర్ నోయిడాలోని ఒక వ్యక్తితో ఈ నెల 26న పెళ్లి జరిగింది. పెళ్లి అయిన రాత్రి ఆమెకు కడుపు నొప్పి వచ్చింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం విని పెళ్లి కొడుకుకు కళ్లు బైర్లు కమ్మినంత పనైంది. ఆమె గర్భవతి అని వైద్యులు చెప్పారు. ఆ మరుపటి రోజే వధువు ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

వాస్తవానికి పెళ్లికి ముందే పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పెళ్లికూతురు పొట్ట కొంచెం పెద్దగా ఉండటంతో... అదే విషయంపై వధువు కుటుంబ సభ్యులను వారు ప్రశ్నించారు. అయితే, పొట్టలో రాళ్లు తీయించుకోవడానికి ఆపరేషన్ చేయించుకుందని... అందుకే కడుపు కొంచెం వాపుగా కనిపిస్తోందని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందిన వరుడి కుటుంబ సభ్యలు పెళ్లికి అభ్యంతర పెట్టలేదు. మరోవైపు తమ కూతురు గర్భవతి అనే సంగతి ఆమె తల్లిదండ్రులకు అప్పటికే తెలుసు. అయితే, ఆ విషయాన్ని వారు దాచిపెట్టారు. 

వధువు ప్రసవించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆమెను కోడలిగా స్వీకరించేందుకు వరుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో నోయిడా నుంచి ఆమెను తల్లిదండ్రులు సికింద్రాబాద్ కు తీసుకొచ్చారు.

More Telugu News