Jithender Reddy: తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలి.. జితేందర్‌‌రెడ్డి వివాదాస్పద ట్వీట్!

  • తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం
  • రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, నేతలు పార్టీ మారుతారంటూ ఊహాగానాలు
  • దున్నపోతుని ఓ వ్యక్తి తన్ని ట్రాలీలోకి ఎక్కించిన వీడియో పోస్ట్ చేసిన జితేందర్ రెడ్డి 
  • ఇలాంటి ట్రీట్‌మెంట్ టీ బీజేపీకి అవసరమని ట్వీట్
bjp leader jithender reddy deleted controversial tweet some time after posting

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని, ఈటల రాజేందర్, రాజగోపాల్‌ రెడ్డి వంటి వారు పార్టీ మారుతారని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది. 

ట్రాలీలోకి ఎక్కేందుకు సతాయించిన దున్నపోతుని  ఓ వ్యక్తి తన్ని ఎక్కించిన వీడియోను జితేందర్ రెడ్డి ఈ రోజు ట్వీట్ చేశారు. ఇలాంటి ట్రీట్‌మెంట్ తెలంగాణ బీజేపీకి కూడా అవసరమంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. పైగా అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సల్‌ లాంటి అగ్రనేతలను ట్యాగ్‌ చేశారు. దీంతో క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ అయింది.  

అయితే ఏమైందో ఏమోగానీ, కొద్ది సేపటికే ట్వీట్‌ను జితేందర్‌‌ రెడ్డి డిలీట్ చేశారు. కానీ నెటిజన్లు మాత్రం అందుకు సంబంధించిన ట్వీట్ వీడియోను పోస్టు చేశారు. దీంతో ఆ వీడియోను మరోసారి జితేందర్‌‌రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితోనే జితేందర్ రెడ్డి ఈ ట్వీట్ చేశారన్నచర్చ జరుగుతోంది.

More Telugu News