ఐశ్వర్య మీనన్ కి అదృష్టం కలిసొచ్చేనా?
- 2012లో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్య మీనన్
- పదేళ్లలో చేసిన సినిమాలు పది మాత్రమే
- ఇంతవరకూ తెలుగు సినిమాల వైపు చూడని భామ
- 'స్పై' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
ఇక మూడో వర్గానికి చెందిన కథానాయికలు, అవకాశాల కోసం గుమ్మంలో వెయిట్ చేస్తారు తప్ప .. ఎదురెళ్లరు. ఇలాంటి కథానాయికలు చాలా తక్కువ సినిమాలు చేస్తుంటారు. అలాంటి కథానాయికల జాబితాలో ఐశ్వర్య మీనన్ కూడా కనిపిస్తుంది. కోలీవుడ్ లో 2012లోనే ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, పదేళ్లలో పదే సినిమాలు చేయడం ఆశ్చర్యం.
తెలుగు తెరకి ఇంతకాలంగా ఆమె పరిచయం కాకపోవడం మరింత ఆశ్చర్యం. అలాంటి ఐశ్వర్య మీనన్, 'స్పై' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. రేపు ఈ సినిమా థియేటర్లకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై ఆమె ఆశలు పెట్టుకుంది. ఇంతకాలం తరువాత టాలీవుడ్ కి పరిచయమవుతున్న ఆమెకి, ఇక్కడ అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.