Tammareddy Bharadwaja: ఈ సినిమా తొలిరోజే రూ. 500 - 600 కోట్లు వసూలు చేస్తుంది: తమ్మారెడ్డి భరద్వాజ

  • 'ప్రాజెక్ట్ కే' ఘన విజయం సాధిస్తుందన్న తమ్మారెడ్డి
  • ప్రపంచ టాప్ 50 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా
  • అయితే ప్రచార కార్యక్రమం బాగా చేపట్టాలని సూచన
Prabhas Project K will collect 500 cr says Tammareddy Bharadwaja

ప్రభాస్, కమలహాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పఠానీలాంటి తారాగణంతో దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కే'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ చిత్రం గురించి ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ సినిమా మన దేశ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని సాధిస్తుందని... తొలిరోజే రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తుందని ఆయన అంచనా వేశారు. అయితే అది ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ చేసే ప్రచార కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం టాప్ 50 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు.

More Telugu News