Prabhas: ఓటీటీలోకి ఆదిపురుష్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసే యోచన
  • త్వరలో అధికారికంగా ప్రకటించనున్న నిర్మాతలు
  • ఈ నెల 16న థియేటర్లలో విడుదలైన ప్రభాస్ మూవీ
Prabhas Adipurush movie will release on August 15 in OTT

ప్రభాస్ హీరోగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆదిపురుష్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటించారు. ఈ నెల 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే, సినిమాలో గ్రాఫిక్స్ పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ప్రభాస్ అభిమానులు సైతం ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్ పై మండిపడుతున్నారు. రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ కారణంగా ఈ సినిమా కలెక్షన్స్ బాగానే రాబట్టింది. 

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ పై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు.

More Telugu News