irland tour: వెస్టిండీస్ సిరీస్ ముగిసిన వెంటనే ఐర్లాండ్ కు టీమిండియా

  • ఆగస్ట్ 18 నుంచి 23 వరకు మూడు టీ20లు
  • డబ్లిన్ శివారులోని మలహైడ్ స్టేడియంలో నిర్వహణ
  • వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఐర్లాండ్ కు ప్రయాణం
After West Indies tour India to visit Ireland for T20I series

మరోసారి టీమిండియా, ఐర్లాండ్ తలపడనున్నాయి. వెస్టిండీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్ తో మూడు టీ20 మ్యాచుల్లో ఆడనుంది. ఈ పర్యటనపై క్రికెట్ ఐర్లాండ్ అధికారికంగా ప్రకటన చేసింది. ఆగస్ట్ 18 నుంచి 23 వరకు మూడు టీ20 మ్యాచులు జరుగుతాయి. డబ్లిన్ శివారులోని మలహైడ్ క్రికెట్ క్లబ్ స్టేడియంలోనే మూడు మ్యాచులను నిర్వహించనున్నారు. 

జులై 12న టీమిండియా వెస్టిండీస్ పర్యటన మొదలవుతుంది. 12 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రెండు టెస్ట్ మ్యాచులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు రెండు జట్ల మధ్య ఉంటాయి. చివరిగా ఆగస్ట్ 13న రెండు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరుగుతుంది. అక్కడి నుంచి భారత జట్టు ఐర్లాండ్ కు ప్రయాణం అవుతుంది. 

గతేడాది కూడా భారత్ ఐర్లాండ్ లో పర్యటించడం తెలిసిందే. జూన్ 26 నుంచి 28 వరకు రెండు టీ20 మ్యాచ్ లు ఆడి వచ్చింది. రెండింటినీ టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 12 నెలల్లో భారత క్రికెటర్లకు రెండోసారి ఐర్లాండ్ స్వాగతం పలుకుతోందని క్రికెట్ ఐర్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ డ్యూట్రామ్ ప్రకటించారు.

More Telugu News