కేసీఆర్ కుటుంబంపై మోదీ డైరెక్ట్ అటాక్
- కేసీఆర్ కూతురుకు మేలు చేయాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్న మోదీ
- మీ కుటుంబ సభ్యులకు మేలు జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని వ్యాఖ్య
- భోపాల్ సభలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన మోదీ
ఈ నేపథ్యంలో భోపాల్ లో నిర్వహించిన ఐదు రాష్ట్రాల బూత్ కమిటీల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.