తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ భేటీ: ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు
- వ్యూహ కమిటీ భేటీలో ఖర్గే, రాహుల్ తో పాటు ఠాక్రే
- తెలంగాణ నాయకులకు, సీనియర్లకు దిశా నిర్దేశనం
- పదిహేనుమందికి మాత్రమే పిలుపు
కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశానికి పదిహేను మందికి మాత్రమే ఆహ్వానం అందింది. ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. తమను ఆహ్వానించకపోవడంపై పలువురు నేతలు ఆసంతృప్తితో ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.