KCR: పండరీపురంలోని విఠల్ రుక్మిణి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో

  • ఉదయం సోలాపూర్ నుంచి పండరీపురం వెళ్లిన కేసీఆర్
  • కాసేపట్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం
  • మధ్యాహ్నం శక్తిపీఠం తుల్జాపూర్ భవాని ఆలయానికి వెళ్లనున్న సీఎం
KCR perfomed pooja at Pandaripuram

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ ఉదయం ఆయన సోలాపూర్ నుంచి పండరీపురంకు చేరుకున్నారు. అక్కడి శ్రీ విఠల్ రుక్మిణి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాసేపట్లో సమీప గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన శక్తిపీఠం తుల్జాపూర్ భవాని ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

More Telugu News