JP Nadda: ప్రొఫెసర్ నాగేశ్వర్, కొరియోగ్రాఫర్ జయంత్ లను కలవనున్న జేపీ నడ్డా

  • రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్న నడ్డా
  • సాయంత్రం నాగర్ కర్నూల్ సభకు హాజరుకానున్న వైనం
  • అనంతరం తిరువనంతపురంకు వెళ్లనున్న బీజేపీ అధ్యక్షుడు
JP Nadda to meet Prof Nageshwar

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. కాసేపు ఆయన నోవాటెల్ హోటల్ లో ఉంటారు. ఈ సమయంలో ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆనంద్ శంకర్ జయంత్ లతో సమావేశం కానున్నారు. 

ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూల్ సభకు వెళతారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొంటారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు ఎయిర్ పోర్ట్ నుంచి తిరువనంతపురంకు బయల్దేరతారు.

More Telugu News