POK: ఉగ్రవాదుల చొరబాటు యత్నం భగ్నం.. కుప్వారాలో మరో నలుగురు ఉగ్రవాదుల హతం

  • కుప్వారాలో మరో భారీ ఎన్‌కౌంటర్
  • పీవోకే వైపు నుంచి చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం
  • కాల్చి చంపిన భద్రతా బలగాలు
4 terrorists killed in Kupwara as security forces foil infiltration bid

జమ్మూకశ్మీర్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి మట్టుబెట్టారు. కుప్వారాలో ఈ తెల్లవారుజామున జరిగిందీ ఘటన. ఈ వారంలో జరిగిన రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదేనని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

నియంత్రణ రేఖ సమీపం కుప్వారాలోని మచల్ సెక్టార్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను చూసిన భద్రతా బలగాలు అప్రమత్తమై కాల్పులు ప్రారంభించాయి. ఎదురుదాడికి దిగిన ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ నెల 16న కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు.

More Telugu News