Jagan: విశ్వసముద్ర బయో ఎనర్జీ పరిశ్రమ నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan inaugurates three more companies construction works
  • మూడు కంపెనీల నిర్మాణ పనులకు శిలాఫలకం ఆవిష్కరణ
  • ఓ కంపెనీకి ప్రారంభోత్సవం
  • అన్నీ వర్చువల్ గా నిర్వహించిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వర్చువల్ గా పలు కంపెనీల నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటు, మరో కంపెనీ ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించిన సీఎం జగన్... క్రిభ్ కో గ్రీన్ ఎనర్జీ, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరెజెస్ పరిశ్రమలకు వర్చువల్ గా శిలాఫలకాలను ఆవిష్కరించారు. 

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ పరిశ్రమల విలువ రూ.1,425 కోట్లు అని, వీటి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
Jagan
Companies
Inauguration
Virtual
YSRCP
Andhra Pradesh

More Telugu News