వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం వివరణ
- ఎంపీ రఘురామరాజు లేఖకు ఈసీఐ స్పందన
- యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్సార్ పార్టీగా మార్చే ప్రతిపాదన లేదన్న పార్టీ
- పార్టీ స్పందనను లేఖ ద్వారా ఎంపీకి తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
తాజాగా ఈ వివరాలు తెలియజేస్తూ రఘురామకు ఎన్నికల సంఘం లేఖ పంపింది. తమ పార్టీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తమకు తెలియజేసినట్టు ఆ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా తమ పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా కానీ, వైఎస్సార్సీపీగా కానీ మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేవని ఆ పార్టీ వివరించిందని కూడా ఈసీఐ ఆ లేఖలో స్పష్టం చేసింది.