Dhulipalla Narendra Kumar: జగన్ అహంకారానికి ఫుల్‌స్టాప్ పక్కా.. ధూళిపాళ్ల నరేంద్ర

  • మార్గదర్శి విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించబోవన్న టీడీపీ నేత
  • ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా షాకవుతున్నారన్న నరేంద్ర
  • జగన్ అహంకారం త్వరలోనే కూలుతుందని హెచ్చరిక
Dhulipalla Narendra Kumar Slams CM YS Jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అహంకారం త్వరలోనే కుప్పకూలుతుందన్నారు. మార్గదర్శి విషయంలో ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఫలించబోవని, అదంతా వృథా ప్రయాస తప్ప మరోటి కాదని తేల్చి చెప్పారు. 

ప్రశ్నించే వారిపై కక్ష పెంచుకుంటున్న ప్రభుత్వాన్ని చూసి ఆలిండియా సర్వీసు అధికారులు కూడా షాకవుతున్నారని అన్నారు. మార్గదర్శిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ప్రభుత్వ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ధూళిపాళ్ల దుయ్యబట్టారు.

More Telugu News