TDP: ఏపీ గవర్నర్ ను కలవనున్న టీడీపీ ముఖ్య నేతలు

  • రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
  • చెరుకుపల్లిలో బాలుడు అమర్నాథ్ హత్య గురించి గవర్నర్ ద‌ృష్టికి..
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరనున్న టీడీపీ బృందం
tdp team to meet ap governor today

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం ఈ రోజు కలవనుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలోని ముఖ్య నాయకులు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తో ఈ మేరకు భేటీ కానున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు.

చెరుకుపల్లిలో బాలుడు అమర్నాథ్ హత్య సహా పలు అంశాలను గవర్నర్ ద‌ృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపైనా ఫిర్యాదు చేయనున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా గవర్నర్ ఆదేశాలివ్వాలని టీడీపీ నేతల బృందం కోరనుందని సమాచారం.

More Telugu News