Prabhas: నైజామ్ లో 'ఆర్ ఆర్ ఆర్' తరువాత స్థానంలో 'ఆదిపురుష్'

  • ప్రభాస్ హీరోగా వచ్చిన 'ఆదిపురుష్'
  • తొలిరోజున 12.24 కోట్ల షేర్ వసూలు 
  • వీకెండ్ లో మరింత వసూళ్లు పెరిగే ఛాన్స్ 
Adipurush movie update

ప్రభాస్ కథానాయకుడిగా 'ఆదిపురుష్' సినిమా రూపొందింది. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, ఓమ్ రౌత్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. వసూళ్ల పరంగా తొలి రోజునే ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసింది. 

ఇక తెలంగాణలోను ఈ సినిమా వసూళ్ల పరంగా ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఇంతవరకూ తొలిరోజున సాధించిన షేర్ విషయంలో 'ఆర్ ఆర్ ఆర్' మొదటి స్థానంలో నిలిచింది. తొలిరోజున ఈ సినిమా ఇక్కడ 23.35 కోట్ల షేర్ ను రాబట్టింది. 

ఇక నిన్న విడుదలైన 'ఆదిపురుష్' తొలిరోజున 12.24 కోట్ల షేర్ ను వసూలు చేసింది. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత స్థానంలో నిలిచింది. ఈ సినిమా కథాపరంగా కొన్ని లోపాలను కలిగి ఉన్నప్పటికీ, ప్రభాస్ కి గల క్రేజ్ కారణంగా వసూళ్ల పరంగా దూసుకుపోతూనే ఉంది. వీకెండ్ లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందనేది చూడాలి.

More Telugu News