Dr BR Ambedkar Konaseema District: వ్యాను-కారు ఢీ.. కోనసీమ జిల్లాలో నలుగురి దుర్మరణం

  • మడికి జాతీయ రహదారిపై ఘటన
  • మందపల్లి దైవదర్శనానికి వ్యాన్‌లో వెళ్తున్న వారిని ఢీకొట్టిన కారు
  • వ్యాన్‌లోని ముగ్గురు, కారులోని ఒకరి మృతి
  • మరో 9 మందికి గాయాలు
4 dead after car collide with van in Konaseema District

కోనసీమ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వాహనంలో కొత్తపేట మండలం మందపల్లికి దైవదర్శనం కోసం వెళ్తుండగా ఆలమూరు మండల పరిధిలోని మడికి జాతీయ రహదారిపై విశాఖ వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి వ్యాన్‌ను ఢీకొట్టింది.  

ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు, కారులోని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది గాయపడగా వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News