MS Dhoni: ఫ్రెండ్స్ తో ధోనీ... పిక్ ఇదిగో!

  • ఇటీవల ముగిసిన ఐపీఎల్
  • చెన్నై సూపర్ కింగ్స్ కు మరో టైటిల్ అందించిన ధోనీ
  • ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వైనం
  • రాంచీలోని ఫాంహౌస్ లో ఫ్రెండ్స్ తో ఆస్వాదన
Dhoni hosts his friends at Ranchi farm house

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ తో మాత్రం క్రికెట్ బంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 16వ సీజన్ ముగియడంతో ధోనీ ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. 

కాస్త ముదురు వయసులోనూ చెన్నై సూపర్ కింగ్స్ కు టైటిల్ అందించి తనలో చేవ తగ్గలేదని చాటిన మహీ... తీరిక సమయాల్లో ఏంచేస్తుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫాంహౌస్ లో ఆర్గానిక్ సేద్యం, కడక్ నాథ్ కోళ్ల పెంపకంతో కాలం గడుపుతుంటాడు. పనేమీ లేకపోతే తన గ్యారేజిలోని మోటార్ సైకిళ్లకు సర్వీసింగ్ చేస్తుంటాడు. 

ఇక స్నేహితులను వెంటేసుకుని తిరగడం, వారికి తన ఇంట ఆతిథ్యం ఇవ్వడంలోనూ ధోనీ ముందుంటాడు. తాజాగా కొందరు స్నేహితులతో కలిసి ధోనీ రాంచీలోని తన ఫాంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన ధోనీ ఇప్పటికీ చిన్ననాటి స్నేహితులను మరువకపోవడం నిజంగా గొప్ప విషయమే.

More Telugu News