Madhya Pradesh: పిల్లల కోసం రెండో పెళ్లి.. 62 ఏళ్ల వయసులో ముగ్గురికి తండ్రైన వ్యక్తి

  • మధ్యప్రదేశ్‌‌లోని సత్నా జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • పిల్లల కోసం భర్తకు లేటువయసులో రెండో పెళ్లి చేసిన భార్య
  • పెళ్లయిన ఆరేళ్లకు రెండో భార్య ప్రసవం
  • ఒకేసారి ముగ్గురు పిల్లలు జన్మించడంతో కుటుంబంలో మిన్నంటిన సంబరం
Man in 60s becomes father after second wife gives birth to triplets in Madhyapradesh

పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్న ఓ పెద్దాయన 62 ఏళ్ల వయసులో ఏకంగా ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 

కుర్ద్ గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహాకు ఇద్దరు భార్యలు. ఆయన కుమారుడు 18 ఏళ్ల వయసులో ఓ రోడ్డు  ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అయితే, గోవింద్‌కు మళ్లీ సంతానభాగ్యం కలిగించాలనే ఉద్దేశ్యంతో పెద్ద భార్య కస్తూరీబాయి ఆయనకు హిరాబాయితో(30) రెండో వివాహం జరిపించింది. ఆరేళ్ల క్రితం ఈ వివాహం జరగ్గా ఇన్నాళ్లకు వారి కోరిక తీరింది. హీరాబాయి తాజాగా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో మరోసారి సంతోషం వెల్లివిరిసింది.

More Telugu News