Hyderabad: హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. !

  • 22 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
  • 14, 15 తేదీల్లో లింగంపల్లి - హైదరాబాద్ రైళ్ల రద్దు
  • 14-17 మధ్య ఇతర మార్గాల్లోని రైళ్లు రద్దు
  • నిర్వహణ పనుల కారణంగా రైళ్ల రద్దు 
MMTS trains cancelled from 14 to 17 in hyderabad

హైదరాబాద్ - సికింద్రాబాద్ నగరాల మధ్య సేవలు అందించే 22 ఎంఎంటీస్ రైళ్లను రెండు రోజుల నుండి నాలుగు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో కొన్ని రైళ్లు, 14 నుండి 17 తేదీల మధ్య మరిన్ని రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించింది. 14, 15 తేదీల్లో లింగంపల్లి - హైదరాబాద్ రైళ్లు, 14 వ తేదీ నుండి 17 వరకు ఉందానగర్ - లింగంపల్లి, లింగంపల్లి - ఫలక్ నుమా, రామచంద్రాపురం - ఫలక్ నుమా మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.

More Telugu News