AADHAR: ఉచితంగా ఆధార్ అప్ డేట్... రేపటితో ముగియనున్న గడువు

  • ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలంటున్న యూఐడీఏఐ
  • మార్చి 15 నుంచి ఉచితంగా అప్ డేట్ చేసుకునే సౌకర్యం
  • జూన్ 14 తుది గడువు
Free update of AADHAR time line will end tomorrow

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి. ఈ క్రమంలో, ఆధార్ వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మార్చి 15 నుంచి ఇది అమలులో ఉంది. అయితే ఈ ఫ్రీ అప్ డేట్ గడువు జూన్ 14తో ముగియనుంది. ఈ గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు ఆధార్ అప్ డేట్ కోసం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 

https://myaadhaar.uidai.gov.in పోర్టల్ లోకి లాగిన్ కావడం ద్వారా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సాయంతో ఆధార్ ను ఎవరైనా అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే, మార్పులు, చేర్పులకు సంబంధించి నిర్దేశిత పత్రాలు సమర్పించడం తప్పనిసరి.

More Telugu News