India: చైనా మొత్తాన్ని టార్గెట్ చేసే అణ్వాయుధాలపై ఇండియా ఫోకస్!

  • చైనా నుంచి ఇండియాకు పొంచి ఉన్న ముప్పు
  • భారీ ఆయుధాలపై ఇండియా ప్రయోగం చేస్తోందన్న సిప్రి
  • ఇండియా వద్ద ప్రస్తుతం 164 వార్ హెడ్లు ఉండొచ్చని వెల్లడి
Iindia focussing on long range weapons

చైనా భూభాగంలోని ప్రతీ ప్రాంతాన్ని చేరుకోగల అణు వార్ హెడ్లను భారత్ సమకూర్చుకుంటోందని స్వీడన్ కు చెందిన సంస్థ సిప్రి (స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తన నివేదికలో వెల్లడించింది. చైనాలోని అన్ని ప్రాంతాలకు చేరుకోగల ఆయుధాలపై ప్రయోగాలు చేస్తోందని తెలిపింది. చైనా, పాకిస్థాన్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో భారత్ అణ్వాయుధ సామర్థ్యంపై దృష్టి సారించిందని, భారీ ఆయుధాలను తయారు చేయాలని నిర్ణయించుకుందని పేర్కొంది. ఇండియా మెయిన్ టార్గెట్ పాకిస్థాన్ అయినప్పటికీ.. చైనా నుంచి ముప్పు ఉండే అవకాశం ఉండటంతో లాంగ్ రేంజ్ వెపన్స్ పై దృష్టి పెట్టిందని తెలిపింది. 

ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడం అణు నిరాయుధీకరణపై పెద్దదెబ్బ కొట్టిందని తెలిపింది. 2022 జనవరిలో చైనా వద్ద 350 వార్ హెడ్స్ ఉండేవని... 2023 జనవరి నాటికి వాటి సంఖ్యను 410కి పెంచుకుందని చెప్పింది. వార్ హెడ్లను పెంచుకునే కార్యక్రమాన్ని చైనా ఇంకా కొనసాగిస్తోందని భావిస్తున్నట్టు తెలిపింది. ఇండియా వద్ద ప్రస్తుతం 164 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండొచ్చని అభిప్రాయపడింది.

More Telugu News