ఏపీలో రేపటి నుంచే స్కూళ్లు ప్రారంభం
- ఈ నెల 17 వరకు ఒంటిపూట నిర్వహణ
- ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 11:30 గంటలకే క్లోజ్
- సెలవులు పొడిగించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి
జూన్ రెండో వారం గడిచినా రాష్ట్రంలో ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు స్కూళ్లకు వెళ్లే క్రమంలో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా సెలవుల పొడిగింపుపై మరోసారి ఆలోచించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.