జైలుకు వెళ్లడం నా జీవితాన్నే మార్చేసింది: వెంకయ్యనాయుడు
- అవినీతి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలన్న వెంకయ్య
- పాశ్చాత్య దేశాల ఆహారాలకు అలవాటు పడొద్దని సూచన
- లాయర్ అవ్వాలనుకుని రాజకీయ నాయకుడినయ్యానని వెల్లడి
అందరూ మన దేశ ఆహార అలవాట్లకు ప్రాధాన్యతను ఇవ్వాలని వెంకయ్య సూచించారు. పాశ్చాత్య దేశాల ఆహారాలకు అలవాటు పడటం మన ఆరోగ్యాలకు మంచిది కాదని చెప్పారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత వ్యాయామానికి, పుస్తకాలు చదవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నానని చెప్పారు.
తాను లాయర్ అవ్వాలనుకున్నానని, కానీ రాజకీయ నాయకుడిని అయ్యానని వెంకయ్య తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో తాను జైలుకు వెళ్లానని... అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. మాతృభాషను, మాతృభూమిని మర్చిపోయేవాడు మనిషే కాదని అన్నారు. ప్రతి వ్యక్తి మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాని సూచించారు.