ఐస్క్రీం తిని అనారోగ్యంపాలైన 70 మంది
- ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఘటన
- రాత్రి భోజనాల అనంతరం కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు
- సమీపంలోని ఆసుపత్రికి తరలింపు
కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో అప్పటికప్పుడు వారిని దమన్జోడి, సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. నిల్వవున్న ఐస్క్రీం తినడం వల్ల అది ఫుడ్ పాయిజన్గా మారడంతో ఇలా జరిగినట్టు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్ పాడి బాధితులు చికిత్స పొందుతున్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరామర్శించారు. చికిత్స అనంతరం కోలుకున్న 60 మందిని నిన్న డిశ్చార్జ్ చేశారు. మిగతా పదిమందికి చికిత్స కొనసాగుతోంది.