ఒడిశా రైలు ప్రమాదం.. హైదరాబాద్ వాసులపై స్పష్టత
- ఒడిశాలోని బాలాసోర్లో ఘోర దుర్ఘటన
- హైదరాబాద్కు చెందిన అవినాశ్కు గాయాలైనట్టు వార్తలు
- నిర్ధారించని అధికారులు
- ప్రమాదానికి గురైన రైళ్లకు తెలంగాణ రూట్లతో సంబంధం లేదని స్పష్టీకరణ
కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన హైదరాబాద్కు చెందిన అవినాశ్కు ప్రమాదంలో కాలు విరిగితే కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తను అధికారులు ధ్రువీకరించలేదు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లకు తెలంగాణ రూట్లతో సంబంధం లేదని, కాబట్టి అక్కడివారు ఎక్కే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు.