బాలాసోర్ కు బయలుదేరిన ప్రధాని మోదీ
- ప్రమాద స్థలంలో అధికారులతో కలిసి పరిశీలన
- కటక్ ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ
- ఉదయం ఢిల్లీలో ఉన్నతాధికారులతో మోదీ సమావేశం
రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో మోదీ భేటీ అయ్యారు. ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఢిల్లీ నుంచే పర్యవేక్షించారు. రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు, ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ప్రధాని మోదీ కూడా ఒడిశా బయలుదేరారు. కాసేపటి క్రితమే ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధాని బయలుదేరినట్లు సమాచారం. ప్రమాద స్థలిలో పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరపడంతో పాటు కటక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు.