ఆసక్తి రేపుతున్న మహా సీఎం-శరద్ పవార్ భేటీ!
- మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశం
- గురువారం సాయంత్రం అరగంట పాటు సమావేశమైన నేతలు
- ఈ మీటింగ్పై ‘మహా’ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
- ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదన్న బీజేపీ
అయితే, ఎన్సీపీ అధినేత మాత్రం ఇది వ్యక్తిగత భేటీ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముంబైలోని మరాఠా మందిర్ అమృత్ మహోత్సవ్ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు వెళ్లానని ఆయన ట్వీట్ చేశారు. మరాఠీ సినిమా, థియేటర్, తదితర రంగాలకు చెందిన కళాకారుల సమస్యలపై సీఎంతో ఈ సమావేశంలో చర్చించానని చెప్పారు. కాగా, మహారాష్ట్ర సీఎం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదని బీజేపీ కూడా వెల్లడించింది.