Karnataka: కర్ణాటకలో కుప్పకూలిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్

  • స్వల్ప గాయాలతో బయటపడిన ఇద్దరు పైలట్లు
  • శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా బెంగళూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరిన విమానం
  • చామరాజనగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో ప్రమాదం
IAF trainer aircraft crashes in Karnataka

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు చెందిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. కర్ణాటకలోని చామరాజనగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు పైలట్లలో ఒకరు మహిళా పైలట్. ఈ మేరకు వాయుసేన ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.

రోజువారీ శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా వాయుసేనకు చెందిన కిరణ్ శ్రేణి విమానం బెంగళరులోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ క్రమంలో చామరాజనగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు భూమిక, తేజ్ పాల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

More Telugu News