Pushpa 2: 'పుష్ప-2' ఆర్టిస్టులతో వస్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

  • నార్కట్ పల్లి వద్ద బస్సుకు యాక్సిడెంట్
  • షూటింగ్ ముగించుకుని వస్తుండగా ప్రమాదం
  • ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
Bus with Pushpa 2 artists met with road accident

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప-2' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆర్టిస్టులు వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురయింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిలో నార్కట్ పల్లి వద్ద ఆర్టిస్టులు వస్తున్న బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. షూటింగ్ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది.

More Telugu News