Mahesh Babu: మహేశ్-త్రివిక్రమ్ చిత్రం నుంచి పవర్ ఫుల్ పిక్ రిలీజ్

  • ఎస్ఎస్ఎంబీ28 వర్కింగ్ టైటిల్ తో మహేశ్ బాబు కొత్త చిత్రం
  • త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్
  • ఈ నెల 31న టైటిల్ అనౌన్స్ మెంట్
  • ఊగిపోతున్న మహేశ్ బాబు ఫ్యాన్స్ 
Powerful pic from SSMB28

టాలీవుడ్ లో మరోసారి మహేశ్ బాబు మేనియా నెలకొంది. మే 31వ తేదీ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఆ రోజు మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్తం టైటిల్ రివీల్ కానుంది. ఈ లోపే చిత్రబృందం మహేశ్ బాబుకు సంబంధించిన ఓ పవర్ ఫుల్ పిక్ ను విడుదల చేసింది. ఫుల్ మాస్ గెటప్ లో ఉన్న మహేశ్ బాబు నేలతల్లికి వందనం చేస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. 

మరో రెండ్రోజుల్లో ఎస్ఎస్ఎంబీ28 నుంచి మాస్ ధమాకా వచ్చేస్తోందని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. మహేశ్ బాబు వీరాభిమానులు ఈ చిత్రం టైటిల్ ను సినిమా థియేటర్లలో రిలీజ్ చేస్తారని వివరించింది. 

ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

More Telugu News