Rahul Gandhi: ప్రధాని పట్టాభిషేకంలా ఫీల్ అవుతున్నారు: రాహుల్ గాంధీ విమర్శలు!

  • అంగరంగ వైభవంగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం
  • ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు దూరం
  • పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక అని రాహుల్ ట్వీట్
parliament is the voice of the people rahul taunts pm modi as new parliament is inaugurated

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సహా 20 దాకా ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఓపెనింగ్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. 

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. పార్లమెంటును ప్రధాని ప్రారంభించడానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ‘‘పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక. కానీ ప్రధాని మాత్రం ఈ ప్రారంభోత్సవ వేడుకను పట్టాభిషేకంలా భావిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News