సత్యేంద్ర జైన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- జైన్ కు 6 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- తమ అనుమతి లేకుండా ఢిల్లీ వదిలి వెళ్లకూడదని షరతు
- మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశం
జైన్ అనారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనకు కొన్ని షరతులు విధించింది. బెయిల్ సమయంలో తమ అనుమతి లేకుండా ఢిల్లీని వదిలి వెళ్లకూడదని ఆదేశించింది. మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని షరతు విధించింది.