Kidnap: 17 ఏళ్ల క్రితం టీనేజ్ లో ఉన్నప్పుడు కిడ్నాప్ అయింది.. ఇప్పుడు ఢిల్లీలో కనిపించింది!

  • 2006లో కిడ్నాప్ అయిన మహిళ
  • దీపక్ అనే వ్యక్తితో కలిసి జీవనం
  • లాక్ డౌన్ తర్వాత విడిపోయిన వైనం
Kidnapped Woman Found After 17 Years In Delhi

2006లో అంటే దాదాపు 17 ఏళ్ల క్రితం కిడ్నాప్ అయిన ఓ మహిళ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కనిపించింది. ఈ విషయాన్ని ఢిల్లీ గోకల్ పురి పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. డీసీపీ రోహిత్ మీనా వెల్లడించిన వివరాల ప్రకారం... సీమపురి పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక టీమ్ సభ్యులు 17 ఏళ్ల క్రితం కిడ్నాప్ కు గురైన మహిళను ట్రేస్ చేశారు. వారికి వచ్చిన సీక్రెట్ సమాచారం మేరకు రంగంలోకి దిగిన టీమ్ ఎట్టకేలకు ఆమెను కనుగొన్నారు. 

సదరు మహిళను పీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆమె పూర్తి వివరాలను వెల్లడించింది. తాను ఇంటినుంచి వెళ్లిపోయాక, దీపక్ అనే వ్యక్తితో కలిసి ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా చెర్దీ గ్రామంలో ఉన్నానని తెలిపింది. లాక్ డౌన్ తర్వాత మనస్పర్థల కారణంగా దీపక్ నుంచి విడిపోయానని... ఢిల్లీలోని గోకల్ పురిలో అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పింది. మరోవైపు ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2006లో ఐపీసీ 363 కింద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

More Telugu News