నువ్వు చస్తే రెండో పెళ్లి చేసుకుంటా.. భార్యకు నరకం చూపిస్తున్నభర్త

Case filed against husband who  Torture wife
  • అదనపు కట్నం కోసం అమెరికాలో మహిళకు వేధింపులు
  • గదిలో బంధించి భోజనం పెట్టకుండా నీళ్లు ఇవ్వకుండా వేధింపులు
  • తప్పించుకుని స్వదేశం చేరుకున్న బాధితురాలు
  • శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు 
చచ్చిపోవాలని నిత్యం నరకం చూపిస్తున్న భర్తపై ఓ మహిళ శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ మండలానికి చెందిన మహిళ (32)తో శంకరపల్లి మండలం మహాలింగపురానికి చెందిన ప్రవీణ్‌రెడ్డికి 2017లో వివాహమైంది. పెళ్లయ్యాక భార్యను తీసుకుని ప్రవీణ్ అమెరికా వెళ్లాడు. వీరికి ఓ బాబు జన్మించాడు. ఈ క్రమంలో కొంతకాలంగా అదనపు కట్నం కోసం ప్రవీణ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. 

అయినప్పటికీ ఆమె కట్నం ఊసెత్తకపోవడంతో దాడి చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసేవాడు. ఓ గదిలో బంధించి భోజనం పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. చచ్చిపోవాలని, అప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే బోల్డంత కట్నం వస్తుందని చెబుతూ నిత్యం నరకం చూపించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేని బాధితురాలు ఒక రోజు తప్పించుకుని అతి కష్టం మీద స్వదేశం చేరుకుంది. ఆపై శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Shamshabad
Crime News

More Telugu News