Telangana: తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల.. టాపర్స్ వీరే!

  • ఎంసెట్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి
  • ఇంజినీరింగ్ టాపర్ శనపాల అనిరుధ్
  • అగ్రికల్చర్, మెడిసిన్ టాపర్ బూరుగుపల్లి సత్య
Telangana EAMCET results out

ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. 

ఇంజినీరింగ్ విభాగంలో 1,95,275 మంది పరీక్ష రాయగా... అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 1,06,514 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,56,879 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 82 శాతం మంది అమ్మాయిలు, 79 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 87 శాతం మంది అమ్మాయిలు, 84 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. త్వరలోనే అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని సబిత వెల్లడించారు. 

ఇంజినీరింగ్ టాప్ ర్యాంకర్లు:

  • ఫస్ట్ ర్యాంక్ - శనపాల అనిరుధ్
  • సెకండ్ ర్యాంక్ - యాకంటిపల్లి మునీందర్ రెడ్డి
  • థర్డ్ ర్యాంక్ - చల్లా ఉమేశ్ వరుణ్
  • ఫోర్త్ ర్యాంక్ - అభినిత్ మంజేటి
  • ఫిఫ్త్ ర్యాంక్ - ప్రమోద్ కుమార్.

అగ్రికల్చర్, మెడిసిన్ టాప్ ర్యాంకర్లు:
  • ఫస్ట్ ర్యాంక్ - బూరుగుపల్లి సత్య
  • సెకండ్ ర్యాంక్ - ఎన్. వెంకటతేజ
  • థర్డ్ ర్యాంక్ - సఫల్ లక్ష్మి
  • ఫోర్త్ ర్యాంక్ - కార్తికేయ రెడ్డి
  • ఫిఫ్త్ ర్యాంక్ - బి. వరుణ్ చక్రవర్తి

More Telugu News