బస్స్టాపులో వేచి ఉన్న మహిళల్ని చూసి కూడా బస్సు ఆపని డ్రైవర్.. వేటేసిన కేజ్రీవాల్ సర్కార్.. వీడియో ఇదిగో!
- ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
- మహిళలను ఎక్కించుకునేందుకు నిరాకరిస్తున్న పురుష డ్రైవర్లు
- కఠిన చర్యలు తప్పవన్న కేజ్రీవాల్
- ఇలాంటి వాటిని వీడియో తీయాలన్న రవాణా మంత్రి
మహిళా ప్రయాణికులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలను ఎక్కించుకునేందుకు పురుష డ్రైవర్లు నిరాకరిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజా ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్రంగా స్పందించిన సీఎం కేజ్రీవాల్.. అలాంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పురుష, మహిళా డ్రైవర్లు స్టాపుల్లో బస్సును ఆపాల్సిందేనని అన్నారు.
మహిళల కోసం బస్సు ఆపని సందర్భాల్లో ఎవరైనా ఆ ఘటనను వీడియో తీసి షేర్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. తాజా ఘటనకు సంబంధించి డ్రైవర్, సిబ్బందిని గుర్తించామని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రైవర్కు ఇలాంటి స్వభావం ఉండడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.