Telangana: జూన్ 8 నుంచి 10 వరకు తెలంగాణలో ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్

  • తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్
  • అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహణ
  • 20 నుంచి 40 వరకు స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి తలసాని
Fish Food Festival in Telangana from June 8th to 10th

వచ్చే నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్టు తెలంగాణ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని మూడు రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణపై సచివాలయంలో మంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ఈ ఫెస్టివల్‌ను  నిర్వహిస్తామన్నారు. స్వయం ఉపాధి కోసం మత్స్యకార మహిళలకు చేపలతో వివిధ రకాల వంటకాలపై శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఈ ఫెస్టివల్‌లో 20 నుంచి 40 వరకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. అలాగే, మత్స్య రంగానికి సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించనున్నట్టు మంత్రి తెలిపారు.

More Telugu News