ఫిల్మ్ చాంబర్ ఎదుట లైగర్ ఎగ్జిబిటర్ల ధర్నాపై స్పందించిన చార్మీ
- లైగర్ సినిమాతో భారీ నష్టాలు వచ్చాయని రిలే నిరాహార దీక్షలు
- బాధితులకు న్యాయం చేస్తామని చార్మీ హామీ
- ఫిల్మ్ చాంబర్ కు మెయిల్ సందేశం పంపించిన సినీ నటి
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ నేటి నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సినీ నటి చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆమె ఫిల్మ్ చాంబర్ కు మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించారు. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.