Singareni Collieries Company: సింగరేణికి జియో మైన్ టెక్ గ్లోబల్ రెయిన్ బో అవార్డు

  • సింగరేణి సంస్థ డైరెక్టర్ బలరాంకు కూడా ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ ఎక్సలెన్స్ అవార్డు
  • ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన నేషనల్ టెక్నాలజీ డేలో అవార్డుల ప్రధానం
  • అవార్డులు అందించిన ఒడిశా మంత్రి
Jio Mine tech global rainbow award for singareni

సింగరేణి సంస్థ జాతీయస్థాయిలో అత్యుత్తమ జియో మైన్‌టెక్‌ గ్లోబల్‌ రెయిన్‌బో అవార్డును సొంతం చేసుకుంది. ఈ సంస్థ డైరెక్టర్ బలరాంను ఇన్నొవేటివ్‌ లీడర్‌షిప్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు వరించింది. జాతీయస్థాయిలో అత్యుత్తమ ఖనిజ కంపెనీలు, అధికారులను జియో మైన్‌టెక్ గుర్తిస్తుంది. గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన నేషనల్‌ టెక్నాలజీ డే సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఒడిశా పర్యావరణ, అటవీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ అమత్ అవార్డులను అందించారు.

More Telugu News