BJP: కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్రకు హాజరు కానున్న అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ

  • మే 14వ తేదీన ఈ యాత్రను నిర్వహిస్తున్నట్టు తెలిపిన బండి
  • హిమంత్‌తో పాటు తరుణ్ చుగ్ తదితర నేతలు హాజరవనున్నారని వెల్లడి
  • హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామన్న బీజేపీ చీఫ్
BJP Hindu Ekta Yatra in Karimnagar on May 14

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ, తరుణ్ చుగ్ తదితర పార్టీ సీనియర్లు హాజరవుతారని చెప్పారు. 

లక్ష మందితో ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరు ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా హిందూ సంఘటిత శక్తిని చాటుదామన్నారు.

More Telugu News