దివ్యాంగ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- శాశ్వత అంగవైకల్యం ఉంటేనే రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టీకరణ
- తాత్కాలిక వైకల్యం ప్రయోజనలను నిలిపివేసిన ప్రభుత్వం
- నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగ రిజర్వేషన్ల నిబంధనలు మారుస్తూ జీవో విడుదల
కొందరికి వైకల్యం నయం అవుతుంటే.. ఇంకొందరికి శాశ్వత అంగవైకల్యం కలిగిన సంఘటనలను గుర్తించింది. ఈ నేపథ్యంలో నియామకాలు, ప్రమోషన్లలో కేవలం శాశ్వత వికలత్వ నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో 41 జారీ చేసింది. దీని ప్రకారం కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లు ఇచ్చే సరిఫికెట్లనే రిజర్వేషన్లకు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.