CBI: వైఎస్ వివేకా హత్య కేసులో వంటమనిషి తనయుడిని విచారించిన సీబీఐ

  • పీఏ కృష్ణారెడ్డి ద్వారా వంటమనిషి కుమారుడు ప్రకాశ్ లేఖ దాచిపెట్టాడని అభియోగం
  • నిన్న వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించిన దర్యాఫ్తు సంస్థ
  • లేఖ గురించి... ఈ రోజు ప్రకాశ్ ను ప్రశ్నించిన సీబీఐ
CBI grills cooks son in ys vivekananda murder case

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మంగళవారం పీఏ కృష్ణారెడ్డిని విచారించిన దర్యాఫ్తు సంస్థ సీబీఐ బుధవారం వంటమనిషి కుమారుడిని విచారించింది. హైదరాబాద్ కోఠిలోని కార్యాలయంలో వంటమనిషి లక్ష్మీదేవి తనయుడు ప్రకాశ్ ను ప్రశ్నించింది. వివేకా హత్య తర్వాత లేఖ దాచి పెట్టడంపై ప్రకాశ్ నుండి సీబీఐ అధికారులు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. లేఖను కృష్ణారెడ్డి ద్వారా ప్రకాశ్ దాచిపెట్టాడనే అభియోగాలు ఉన్నాయి.  

More Telugu News