Saitej: 12 రోజుల్లో 'విరూపాక్ష' ఎంత వసూలు చేసిందంటే ..!

  • ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన 'విరూపాక్ష'
  • నిన్నటితో 12 రోజులను పూర్తి చేసుకున్న సినిమా 
  • ఇంతవరకూ 81 కోట్ల గ్రాస్ వసూలు
  • త్వరలో 100 కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్ 
Virupaksha Movie Update

ఈ మధ్య కాలంలో తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలలో ఒకటిగా 'విరూపాక్ష' కనిపిస్తుంది. సాయితేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన రోజునే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడిగా కార్తీక్ వర్మ దండుకు మంచి మార్కులు పడ్డాయి. 

తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 4 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. నిన్నటితో ఈ  సినిమా 12 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 12 రోజుల్లో ఈ సినిమా 81 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. 

ఈ వారం 'రామబాణం' ..  'ఉగ్రం' సినిమాలు థియేటర్లకు వస్తున్నప్పటికీ, ఈ జోనర్లకు పూర్తి భిన్నమైన జోనర్లో 'విరూపాక్ష' ఉంది. అందువలన ఆ సినిమాలు 'విరూపాక్ష' వసూళ్లపై అంతగా ప్రభావం చూపించలేకపోవచ్చు. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

More Telugu News