Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 463 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 150 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతం వరకు పెరిగిన విప్రో షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 463 పాయింట్లు లాభపడి  61,112కి చేరుకుంది. నిఫ్టీ 150 పాయింట్లు పుంజుకుని 18,065కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (2.89%), నెస్లే ఇండియా (2.77%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.32%), ఎల్ అండ్ టీ (2.24%), ఐటీసీ (2.24%). 

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.39%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.75%), టైటాన్ (-0.70%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.63%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.56%).
Sensex
Nifty
Stock Market

More Telugu News