Nara Lokesh: మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర

  • 80వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
  • గవిగట్టు క్రాస్, బాపులదొడ్డి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమైన లోకేశ్
  • ఈ రాత్రికి కోసిగి శివారులో బస
Lokesh Padayatra enters Mantralayam Constituency

టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అంతేకాదు పాదయాత్ర 80వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమయింది. కాసేపటి తర్వాత మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేశ్ కు మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జీ తిక్కారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి కోసిగి శివారులో లోకేశ్ బస చేయనున్నారు.  

80వ రోజు (25-4-2023) యువగళం వివరాలు:

*మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):*

ఉదయం

8.00 – తుంబళం క్రాస్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.20 – మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
8.30 – గవిగట్టు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
9.05 – బాపులదొడ్డి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
9.55 – పేకలబెట్ట క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

మధ్యాహ్నం

12.00 – కోసిగిలో స్థానికులతో మాటామంతీ.
12.30 – కోసిగి యల్లమ్మ దేవాలయం సమీపంలో భోజన విరామం.

సాయంత్రం

5.00 – కోసిగి యల్లమ్మ దేవాలయం వద్ద బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
6.15 – కోసిగి బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.
6.25 – కోసిగి తేరుబజార్ వద్ద షాప్ కీపర్లతో భేటీ.
7.00 – కోసిగి చింతకుంట క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
7.10 – కోసిగి శివారు విడిది కేంద్రంలో బస.

More Telugu News