Uttar Pradesh: నామినేషన్ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు పెళ్లి.. ఆపై భార్యతో నామినేషన్!

  • ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో ఘటన
  • మహిళకు రిజర్వు అయిన స్థానం కోసం పెళ్లి చేసుకున్న నాయకుడు
  • పెళ్లి అనంతరం భార్యతో నామినేషన్
  • గత వారం రాంపూర్‌లో ఇదే కారణంతో కాంగ్రెస్ నాయకుడి వివాహం
Marriage for the election in UPs Pilibhit

నామినేషన్ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తన భార్యను ఎన్నికల బరిలో నిలిపాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి మున్సిపాలిటీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 

గత ఎన్నికల్లో 16వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించిన అవతార్ సింగ్ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావించారు. అయితే, తాజాగా ఆ వార్డును అధికారులు మహిళకు రిజర్వు చేశారు. దీంతో ఏం చేయాలో అవతార్ సింగ్‌కు అర్థం కాలేదు. ఆ తర్వాత ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నామినేషన్ల గడువు ముగియనుండడంతో కొన్ని గంటల ముందు ఓ అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెతో నామినేషన్ వేయించారు. దీంతో ఈ పెళ్లి కాస్తా చర్చనీయాంశమైంది. 

కాగా, ఇదే రాష్ట్రంలోని రాంపూర్‌లోనూ గతవారం ఇలాంటి ఘటనే జరిగింది. రాంపూర్ మున్సిపాలిటీ స్థానంపై కన్నేసిన కాంగ్రెస్ నాయకుడు మమూన్‌షా ఖాన్ (45) కూడా ఇలానే ఎన్నికల కోసం అప్పటికప్పుడు పెళ్లి చేసుకుని భార్యను బరిలో నిలిపారు.

More Telugu News