పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 5 నుంచి సీయూఈటీ పరీక్షలు

పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 5 నుంచి సీయూఈటీ పరీక్షలు

CUET will be commenced from June 5
  • వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్
  • సీయూఈటీని నిర్వహిస్తున్న ఎన్టీఏ
  • దరఖాస్తుల గడువు మే 5 వరకు పొడిగింపు
  • తాజా సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ చూస్తుండాలన్న ఎన్టీఏ
దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీయూఈటీ పరీక్షలు జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది. పీజీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు మే 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. 

వాస్తవానికి దరఖాస్తుల గడువు ఏప్రిల్ 19తోనే ముగిసింది. తాజాగా, ఈ గడువును మరింత పొడిగించారు. కాగా, సీయూఈటీ పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం నిత్యం ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తుండాలని విద్యార్థులకు ఎన్టీఏ సూచించింది.
Advertisement
CUET
Entrance Test
PG Courses
Universities
NTA
India

More Telugu News